Home   »  తెలంగాణఉద్యోగంవార్తలు   »   సెలవు లేదు.. నేటి నుండి స్కూళ్ల పున:ప్రారంభం

సెలవు లేదు.. నేటి నుండి స్కూళ్ల పున:ప్రారంభం

schedule raju

తెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు నేడు పున:ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం సెలవు ప్రకటిస్తుందని కొంతమంది విద్యార్థులు, తల్లిదండ్రులు భావించినా.. విద్యాశాఖ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో నేటి నుంచి యథావిధిగా స్కూళ్లు, కాలేజీలు నడవనున్నాయి.

అయితే జులై 31న పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా IMD తెలిపింది. దీంతో రేపు కూడా విద్యార్థులకు సెలవు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వర్షాల నేపథ్యంలో డెంగ్యూ, మలేరియా, అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని వైద్య, ఆరోగ్య శాఖ హెచ్చరిస్తోంది.

తాగునీరు కలుషితం అయ్యే అవకాశం ఉన్నందువల్ల స్కూళ్లు, హాస్టళ్ల విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై మండలాల వారీగా నివేదికలు తెప్పించుకోవాలని సిబ్బందిని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ పరిణామాల నేపథ్యంలో నేడు సెలవు ప్రకటించాలని చాలా మంది కోరుతున్నారు.