ఆదిలాబాద్: శివాజీ చౌక్ కూరగాయల మార్కెట్లో హోల్సేల్, రిటైల్ దుకాణాలను మున్సిపల్ అధికారులు మంగళవారం సీజ్ చేయడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ అధికారులు ఎలాంటి సీజింగ్ లెటర్ ఇవ్వకుండా అక్రమంగా తమ దుకాణాలను సీజ్ చేసి వ్యాపారానికి ఇబ్బందులు సృష్టించారని దుకాణదారులు ఆరోపించారు.
ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాజిద్ఖాన్ మాట్లాడుతూ సీజ్ లెటర్ ఉందా అని సంబంధిత అధికారులను ప్రశ్నించగా, తమ వద్ద ఎలాంటి లేఖ లేదని, అధికారుల ఆదేశాల మేరకు దుకాణాలను సీజ్ చేస్తున్నామని వారు తెలిపారు. సుమారు 52 మంది పేద కూరగాయల దుకాణదారులు రోడ్డున పడతారని, వారికి వెంటనే మరో స్థలం ఇవ్వాలని సాజిద్ఖాన్ డిమాండ్ చేశారు.