Home   »  ఉద్యోగంతెలంగాణవార్తలు   »   గ్రూప్‌-2 పరీక్ష పై కీలక ప్రకటన

గ్రూప్‌-2 పరీక్ష పై కీలక ప్రకటన

schedule raju

తెలంగాణ: గ్రూప్‌-2 పరీక్ష షెడ్యూల్‌ ప్రకారమే జరగనుంది. పరీక్ష వాయిదా వేయాలని ఇటీవల కొంత మంది డిమాండ్‌ చేశారు. దీనిపై సీఎం కేసీఆర్‌… సీఎస్‌ శాంతికుమారితో చర్చించి, అన్ని విషయాలు పరిశీలించిన తర్వాత గ్రూప్‌-2 పరీక్ష యథావిధిగా కొనసాగుతుందని అసెంబ్లీ వేదికగా స్పష్టతనిచ్చారు. మిగిలిన పరీక్షల నిర్వహణపై మరోసారి అధికారులతో చర్చించాలని CSను ఆదేశించారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ….’ రిక్రూట్మెంట్ దశలవారీగా చేయాలని ముందే చెప్పాం. ఒక అభ్యర్థి ఎక్కువ పరీక్షలు రాసే వెసులుబాటు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచనలు ఇచ్చాం. నేను ఇంతకు ముందే చీఫ్ సెక్రటరీతో మాట్లాడాను. ఇప్పటికే ప్రకటించిన పరీక్షలను రద్దు చేయడం సరికాదు. గ్రూప్ 2 పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో వాటిని మార్చేందుకు వీలుకాదు. అలా చేస్తే ప్రిపేర్ అయిన అభ్యర్థులకు ఇబ్బందులు వస్తాయి అని ప్రసంగించారు.

దీనితో ఆగష్టు 29, 30 తేదీల్లో నిర్వహించే గ్రూప్‌ 2 పరీక్ష నిర్ణయించిన తేదీననే జరగనుంది. కావున అభ్యర్థులు పరీక్షకు సన్నద్ధం కావాలి.