విశాఖపట్నంలో ఓ యువతి ఇద్దరు యువకులతో ప్రేమాయణం నడిపిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ కారణంగా మూడు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఒకరిని ప్రేమించి, మరొకరిని రహస్య వివాహం చేసుకున్న ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడంతో పాటు మరొకరి మృతికి కారణమైంది. ఆమె తల్లిదండ్రులకు తీవ్ర గుండె కోతను మిగిల్చింది.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం, కొత్తపాలెం నాగేంద్ర కాలనీనికి చెందిన 16 ఏళ్ల అమ్మాయి విశాఖలోని ఓ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతుంది. ఇటీవల సూర్య ప్రకాశ్, సాయి కుమార్ ఇద్దరూ ఆ అమ్మాయి ఇంటికి వేర్వేరు సమయాల్లో వచ్చి మా ఇద్దరిలో ఎవరితో ఉంటావో తేల్చుకోమని బెదిరించి వెళ్లారు.
వారు బెదిరించిన రెండు రోజులకే ఆమె ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో యువతి తండ్రి యువకులపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. వారిద్దరూ ఒత్తిడి చేయడం వల్లే అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.