హైదరాబాద్: గ్రూప్-2 పరీక్ష రీషెడ్యూల్ చేసిన తాజాగా కొత్త తేదీలను TSPSC సాయంత్రం విడుదల చేసింది. నవంబర్ 2, 3 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించనున్నట్టు TSPSC వెల్లడించింది. తెలంగాణలో మొత్తం 783 గ్రూప్ 2 ఉద్యోగాలకు 5,51,943 మంది దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. అంటే ఒక్కో పోస్టుకు సగటున 705 మంది పోటీ పడనున్నారు. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు జరగాల్సి ఉంది. ఆగస్టు నెలలో గురుకుల టీచర్ పరీక్షలు, స్టాఫ్నర్స్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్, పాలిటెక్నిక్, జూనియర్ లెక్చరర్, ఎస్ఎస్సీ, ఐబీపీఎస్ వంటి పలు పోటీ పరీక్షలు ఉండటంతో గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు, రాజకీయ పార్టీల నేతలు ఆందోళనలు చేశారు. కేసీఆర్ ఆదేశాల మేరకు పరీక్షలను నవంబరుకు వాయిదా వేసిన ప్రభుత్వం.. తాజాగా కొత్త తేదీలను ప్రకటించింది.
గ్రూప్-2 పరీక్ష వాయిదా,తాజాగా కొత్త తేదీలను ప్రకటించిన TSPSC..
Related News
Also Read