మెదక్: ఈ నెల 19న సీఎం కేసీఆర్ మెదక్ జిల్లాలో నూతన సమీకృత కలెక్టరేట్, ఎస్పీ భవనాన్ని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి హరీష్రావు అధికారులతో సమీక్షించారు. పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బహిరంగ సభ జరిగే ప్రదేశాన్ని పరిశీలించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రతపై అధికారులకు తగుసూచనలు చేశారు.
20న సూర్యాపేట జిల్లాలో పర్యటించి కలెక్టరేట్, జిల్లా పోలీసు (ఎస్పీ) కార్యాలయాలతోపాటు నూతనంగా నిర్మించిన మెడికల్ కాలేజీని కూడా ప్రారంభిస్తారు. అనంతరం సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి బహిరంగ సభలో ప్రసంగిస్తారు.