ఖమ్మం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. నాగ్పూర్-అమరావతి హైవే భూసేకరణను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. హైవే అలైన్మెంట్ మార్చాలని, నిర్వాసిత రైతులకు పరిహారం పెంచాలని రైతు సంఘాల నేతలు నిరసనకు దిగారు. వీరికి కాంగ్రెస్, వామపక్షాలు మద్దతు పలికాయి. రైతులు, రైతు సంఘాల నేతలు కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
ఖమ్మం కలెక్టరేట్ వద్ద రైతుల నిరసన.. ఉద్రిక్తత
Related News
Also Read