Home   »  వార్తలు   »   వింత పోరాటం.… పాముని మింగిన చేప….!

వింత పోరాటం.… పాముని మింగిన చేప….!

schedule sirisha

మహబూబాబాద్: ఎక్కడైనా ఓ చేప పాముని మింగటం గురించి విన్నారా ? దంతాలపల్లి మండలం లక్ష్మీపురంలో అదే జరిగింది. ఓ చేప విషపూరితమైన తాచు పామును మింగిన వింత ఘటన చోటుచేసుకుంది.

గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం, లక్ష్మీపురం పాలేరు వాగు చెక్‌డ్యాం వద్ద గల నీటి ఒడ్డుకు ఓ తాచు పాము వచ్చి ఒడ్డుకు సమీపంలో ఉన్న చిన్న చిన్న చేపలను మింగేందుకు అది ప్రయత్నిస్తుండగా అక్కడికి చేరుకున్న వాలుగ రకానికి చెందిన ఓ పెద్ద చేప తాచు పామును మింగేసింది.

పామును నోట చిక్కించుకొని మింగుతున్న చేప నుంచి విడిపించుకునేందుకు పాము చాలాసేపు ప్రయత్నం చేసినప్పటికి ఫలితం లేకపోయింది. అవి రెండూ పోరాడుతుండగా గ్రామస్థులు చూశారు. చాలా సేపటి వరకు అవి వాటి పోరాటాన్ని అప్పలేదు కానీ చివరకు రెండు చనిపోయాయి.