ఆంధ్రప్రదేశ్: చిత్తూరుకు చెందిన కవి రాసిన ఒక కవిత తన మనసుకు తగిలిన గాయం లాగా అనిపించిందని బాధపడి ఒక సభలో చదివి వినిపించిన జనసేన పవన్ కళ్యాణ్. ప్రజల బాధలు పట్టించుకోని ఈ నాయకులు ఎందుకు మనకు అని ప్రశ్నించారు.
“సేద్యం జూదం అయింది. అమ్మ మెడలో తాళి బొట్టు పసుపు కొమ్ము అయింది. చెల్లి చెవులకు ఉండే కమ్మలు జొన్న బెండులు అయినాయి. తమ్ముడు బడికెళ్లడం మాని ఇటుక బట్టిలో కాలిన ఇటుక అయ్యాడు. నువ్వేమో హోటల్లో ఎంగిలాకువు అయినావు. దేశానికి పట్టెడన్నం పెట్టే మీ తాత బస్టాండ్లో బిచ్చగాడు అయినాడు” అని ఓ కవి రాసిన మాటలు తనను కదిలించాయని పవన్ చెప్పారు.