న్యూఢిల్లీ : గత ఏడాది రిషబ్ పంత్ ఢిల్లీ-డెహ్రాడూన్ హైవేపై కారులో వెళ్తుండగా డివైడర్ను ఢీకొని మంటలు చెలరేగాయి. దానిలో నుండి పంత్ అద్భుతంగా బయటపడ్డాడు. భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తన కారు ప్రమాదం తర్వాత మొదటిసారిగా బెంగళూరులో క్లబ్ గేమ్లో బ్యాటింగ్ చేయడంతో క్రికెట్ అభిమానులు ఆనందపడ్డారు.
ట్విటర్ X లో ప్రసారం అవుతున్న వీడియోలో పంత్ బౌండరీలు దాటి బంతిని కొట్టడానికి పిచ్పై నమ్మకంగా ముందుకు సాగడం చూడవచ్చు. ప్రేక్షకులు, అభిమానులు ఆనందంలో మునిగి పోయారు. బెంగళూరులోని ఎన్సిఎలో కోలుకుంటున్న ఈ 25 ఏళ్ల యువకుడు జెఎస్డబ్ల్యు ఫౌండేషన్ నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ అతను ప్రసంగం కూడా చేశాడు.