Home   »  వార్తలు   »   కేసీఆర్ కు బీసీల తడాఖా చూపిస్తాం: జాజుల శ్రీనివాస్

కేసీఆర్ కు బీసీల తడాఖా చూపిస్తాం: జాజుల శ్రీనివాస్

schedule mounika


TS: కేసీఆర్ కు బీసీల తడాఖా చూపిస్తాం అన్న జాజుల శ్రీనివాస్. CM KCR ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో బీసీలకు అన్యాయం జరిగిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. రాష్ట్ర జనాభాలో 60 శాతం ఉన్న బీసీలకు బీఆర్ఎస్ పార్టీ జాబితాలో 20శాతం, 5శాతం ఉన్న రెడ్లకు 33శాతం, అరశాతం ఉన్న వెలమలకు 16శాతం టికెట్లు కేటాయించారని జాజుల శ్రీనివాస్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన స్థానాల్లో జనగామ ,నర్సాపూర్ స్థానికులైన బీసీ ల కు కేటాయంచాలని, ఆ రెండు స్థానాల్లో బీసీ లే 80 శాతం ఉన్నారని జాజుల శ్రీనివాస్ అన్నారు. రానున్న ఎన్నికల్లో కేసీఆర్ కు బీసీల తడాఖా చూపిస్తామనిహెచ్చరించారు.