TS: ఆదిలాబాద్ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటుకు అనుమతి లభించింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు జారీ చేశారు. కాలేజీల్లో కోర్సులు, సిబ్బంది, బడ్జెట్ వివరాలను త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.
మరోవైపు ఇంజనీరింగ్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్ ఈ నెల 26వవరకు పొడిగించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్లోని జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ రిజిస్ట్రార్, హైదరాబాద్లోని తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఈ జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటుకు సంబంధించి అవసరమైన తదుపరి చర్యలు తీసుకుంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈ కాలేజీని ప్రత్యేక కౌన్సెలింగ్ జాబితాలో అనుమతిస్తారా లేదా అనే విషయమై స్పష్టత లేదు.