కర్ణాటక: భారీ బడ్జెట్తో రూపొందనున్న కాంతారా 2, బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ‘కాంతారా‘ కేవలం 16 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ చిత్రానికి రిషబ్ శెట్టి హీరోగా, దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 400 కోట్ల వసూలు చేసింది. ఈ చిత్రం యొక్క రెండవ భాగం ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. మూవీ మేకర్స్, హోంబలే ఫిల్మ్స్ బడ్జెట్ను భారీగా పెంచారు.
దాదాపు 125 కోట్ల బడ్జెట్తో ఈ సినిమా తీస్తున్నట్టు తెలుస్తుంది. మొదటి భాగం భారీ విజయాన్ని అందుకోవడంతో భారీ బడ్జెట్ తో పార్ట్ 2 మీద దృష్టిపెట్టారు. మొదటి భాగం తర్వాత రిషబ్ శెట్టి పాపులర్ హీరోగా మారాడు. అతను ఇప్పుడు స్క్రిప్ట్ను పూర్తి చేసి షూట్కు సిద్ధమవుతున్నాడని నిర్మాతలు తెలిపారు.