తెలంగాణ: మెదక్ వేదికగా ముఖ్యమంత్రి KCR దివ్యాంగులకు తీపికబురు అందించనున్నారు. నేటి నుంచి పెరిగిన పెన్షన్ రూ.4016 పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 5. 50లక్షల మందికి లబ్ది జరగనుంది. అదేవిధంగా బీడీ టేకేదారులకు, ప్యాకర్లకు రూ.2016 చొప్పున పెన్షన్ పంపిణీని ప్రారంభిస్తారు. ఇవాళ మెదక్ జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి కొత్తగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్, SP ఆఫీస్, BRS పార్టీ ఆఫీస్ను ప్రారంభిస్తారు.
ఇక ఈ పర్యటనలో భాగంగా రోడ్డు మార్గాన హైదరాబాదులోని ప్రగతి భవన్ నుంచి గుమ్మడిదల, నరసాపూర్, కౌడిపల్లి మీదుగా మెదక్ చేరుకోనున్నారు సీఎం కేసీఆర్. ఇక మెదక్ CSI చర్చి గ్రౌండ్ లో లక్షమందితో ప్రగతి శంఖారావం సభలో పాల్గొంటారు.