Home   »  రాజకీయం   »   చంద్రమండలంపై 3 ఎకరాల భూమి ఇస్తానంటాడు: సంజయ్

చంద్రమండలంపై 3 ఎకరాల భూమి ఇస్తానంటాడు: సంజయ్

schedule mounika

TS: KCR చంద్రమండలంపై 3 ఎకరాల భూమి ఇస్తానంటాడు అని ఎంపీ బండి సంజయ్ వ్యంగ్యంగా అన్నారు. చంద్రయాన్-3 సక్సెస్ కావడంతో సీఎం కేసీఆర్ చాలా సంతోషంగా ఉన్నారని ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఇక్కడ దందాలు పూర్తయ్యాయి. ఇక నుంచి చంద్రమండలంలో కొత్త దందాలు చేసుకుందామని కేసీఆర్ అనుకుంటున్నారు. ఎన్నికల్లో BRS గెలిస్తే చంద్రమండలం పైన మూడెకరాల భూమి ఇస్తామని హామీ ఇస్తారు. చంద్రయాన్-3 సక్సెస్ కావాలని ప్రధాని మోదీ, సైంటిస్టులకు ‘నేనే చెప్పిన అని కూడా చెప్పుకుంటారు’ అని సెటైర్లు వేశారు.