హైదరాబాద్, క్రీడా ప్రతినిధి: జూన్లో తైపీలో జరిగే ప్రతిష్టాత్మక ఆసియాకప్ సాఫ్ట్బాల్ టోర్నమెంట్ కి ఆరుగురు ఎస్సీ గురుకుల విద్యార్థులు భారత జట్టుకు ఎంపికయ్యారు. జాతీయ సాఫ్ట్బాల్ సమాఖ్య గురువారం 16 మంది ఆటగాళ్లతో భారత జట్టును ప్రకటించగా అందులో మన గురుకుల క్రీడాకారులు ఉండటం విశేషం.
జాతీయ స్థాయిలో నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్న సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ (TSWREIS)కి చెందిన సాఫ్ట్బాల్ క్రీడాకారులు ఆసియా టోర్నమెంట్లో కూడా సత్తా చాటాలని నిశ్చయించుకున్నారు. ప్రస్తుతం సాఫ్ట్ బాల్ అకాడమీలో శిక్షణ పొందుతూ తమదైన రీతిలో ప్రతిభ కనబరుస్తున్నారు. వారిలో సౌమ్యరాణి (తాడ్వాయి), సాత్విక, సౌందర్య, శ్రావిక (సుద్దపల్లి), సరయు (ధర్మారాం), కార్తీక (తూప్రాన్).