Home   »  జాతీయం   »   మధురై రైలు ప్రమాద బాధితులకి 3 లక్షల సాయం: స్టాలిన్

మధురై రైలు ప్రమాద బాధితులకి 3 లక్షల సాయం: స్టాలిన్

schedule vamshi

తమిళనాడు: తమిళనాడు CM MK స్టాలిన్ మధురై రైలు ప్రమాదంలో మరణించిన తొమ్మిది మంది ప్రయాణికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 3 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మధురైలోని రాజాజీ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు ఉత్తమ చికిత్స అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. మృతులు, గాయపడిన వారి కుటుంబాల అవసరాలను తీర్చడానికి తమిళనాడు వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి P మూర్తిని నియమించారు. భారతీయ రైల్వే కూడా మృతుల కుటుంబాలకు రూ 10 లక్షల పరిహారం ప్రకటించింది.