Home   »  వార్తలు   »   భారతదేశంలో 12,193 తాజా COVID-19 కేసులు, 42 మరణాలు నమోదయ్యాయి.

భారతదేశంలో 12,193 తాజా COVID-19 కేసులు, 42 మరణాలు నమోదయ్యాయి.

schedule chiranjeevi

న్యూఢిల్లీ: భారతదేశంలో గత 24 గంటల్లో 12,193 తాజా కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి ఇన్ఫెక్షన్ యొక్క క్రియాశీల కేసుల సంఖ్య 67,556కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది.

ఉదయం 8 గంటలకు అప్‌డేట్ చేసిన మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం గత 24 గంట్లలో కోవిడ్-19 వ్యాధి వల్ల మరణించిన వారి సంఖ్య 42 కి చేరుకుంది. ఇప్పటి వరకు వ్యాధి వల్ల మరణించిన వారి సంఖ్య 5,31,300కి చేరుకుంది. దేశంలో 4,48,81,877 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి

ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం మొత్తం క్రియాశీల కేసులు 0.15 శాతం ఉండగా జాతీయ COVID-19 రికవరీ రేటు 98.66 శాతంగా నమోదైంది.

వ్యాధి నుండి కోలుకున్న వారి సంఖ్య 4,42,83,021కి చేరుకోగా మరణాల రేటు 1.18 శాతంగా నమోదైంది.

మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకార, దేశవ్యాప్తంగా ప్రజలకు ఇప్పటివరకు 220.66 కోట్ల డోస్‌ల యాంటీ కోవిడ్ వ్యాక్సిన్‌లు అందించబడ్డాయి.