ఆంద్రప్రదేశ్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో యువగళం పాదయాత్ర కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా సీఎం జగన్ పాలనలో రోడ్లన్నీ దుర్భరంగా తయారయ్యాయని లోకేశ్ మండిపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా చీపురుగూడెం వద్ద గోతుల రోడ్డులో వరినాట్లు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దివాలా కోరు సీఎం ముఖం చూసి రోడ్లు వేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదన్నారు. నాలుగేళ్లలో రూ.130 లక్షల కోట్ల బిల్లులను పెండింగ్లో పెట్టారని ఆరోపించారు. తమ హయాంలో 25వేల KMల సిమెంటు రోడ్లు వేశామని చెప్పారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కనీసం రోడ్లపై తట్ట మట్టి పోసే దిక్కు కూడా లేకుండా పోయిందని అన్నారు. రోడ్ల కోసం అంతర్జాతీయ సంస్థల నుంచి తెచ్చిన నిధులను కూడా జగన్ దారి మళ్లించారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో పాడైపోయిన రోడ్లన్నింటినీ పునర్నిర్మిస్తామని స్పష్టం చేశారు.