హైదరాబాద్: అత్తాపూర్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ యువతి ఇంట్లో జరిగిన చిన్న గొడవకే భర్తను వదిలేసిపోయింది. దీంతో మనస్థాపం చెందిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్ అత్తపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. రామ్చంద్ర (30) ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. రామ్చంద్రకు 9 నెలల క్రితం వివాహం అయింది. అయితే ఇంట్లో జరిగిన చిన్న గొడవ కారణంగా భార్య అతన్ని వదిలిపెట్టి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో గత మూడు నెలలుగా అతను అత్తాపూర్ పరిధిలోని మారుతినగర్లో ఇంటిని అద్దెకు తీసుకుని ఒంటరిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో భార్య వదిలేసి పోయిందనే మానసిక వ్యధతో కఠిన నిర్ణయం తీసుకొని శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
కఠిన నిర్ణయం తీసుకున్న యువకుడు..
Related News
Also Read