Home   »  రాజకీయం   »   BRS ఎమ్మెల్యేలకు సిగ్గులేదా ?

BRS ఎమ్మెల్యేలకు సిగ్గులేదా ?

schedule mounika

BRS ఎమ్మెల్యేలకు సిగ్గులేదా, ఎక్కడ ఏం మాట్లాడాలో వారికి తెలియదా అని MLA రాజాసింగ్ ప్రశ్నించారు. సంగారెడ్డి, తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరులో డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ సందర్భంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీపై విమర్శలు చేయడంతో అదే వేదికపై ఉన్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్టేజీ దిగి వెళ్లిపోయారు. అనంతరం రాజాసింగ్ మాట్లాడుతూ వేదిక పై ఉన్న బీఆర్ఎస్ నేతలు బీజేపీని తిట్టేందుకే వేదికను వాడుకున్నారన్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ ప్రభుత్వం తమాషాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా తన నియోజకవర్గమైన గోషామహల్‌ పరిధిలో చాలా మంది అనర్హులకు డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టబెట్టారని మండిపడ్డారు. అలాగే సీఎం కేసీఆర్ హయాంలో రాష్ట్రం మత్తుల‌ తెలంగాణగా మారిందని రాజా సింగ్ ఆరోపించారు.