Home   »  వార్తలు   »   చెరువులో చేప పిల్లలను వదిలిన ఎమ్మెల్యే…

చెరువులో చేప పిల్లలను వదిలిన ఎమ్మెల్యే…

schedule mounika

వరంగల్: వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామ పెద్ద చెరువులో ఎమ్మెల్యే ఆరూరి రమేష్ చేప పిల్లలను వదిలిపెట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారులు ఆర్థికాభివృద్ధికి పాటుపడుతుంది అన్నారు. అన్ని చెరువుల్లో జలకళ సంతరించుకోండంతో ఉచిత చేప పిల్లలను వదులుతున్నట్లు పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్‌ కృషితో మత్స్యకారులకు ఉపాధి లభిస్తున్నదని, రాష్ట్రంలో మత్స్య సంపద పెరిగిందన్నారు. వందశాతం సబ్సిడీపై చేపపిల్లలను ప్రభుత్వం సరఫరా చేస్తుండగా, చేపల విక్రయానికి వాహనాలను 60శాతం రాయితీ తో అందజేస్తున్నట్లు తెలిపారు.

కాంగ్రెస్‌ పాలనలో జరగని అభివృద్ధి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం బీఆర్‌ఎస్‌ సర్కార్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపించిందన్నారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అప్పారావు, జెడ్పీటీసీ మార్గం భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.