తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. రానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా బిల్లు కోసం కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని, మహిళా బిల్లు ఆమోదానికి మద్దతు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం చారిత్రక అవసరమని తెలిపారు. చట్ట సభల్లో మహిళా ప్రాతినిధ్యం పెరుగుదలతో ప్రజాస్వామ్యం పరిపూర్ణమవుతుందని పేర్కొన్నారు.
రాజకీయ పార్టీలకు ఎమ్మెల్సీ కవిత లేఖ..
Related News
Also Read