Home   »  రాజకీయం   »   ఉపాధ్యాయుల పై ప్రభుత్వం కక్ష సాధింపు: పవన్‌

ఉపాధ్యాయుల పై ప్రభుత్వం కక్ష సాధింపు: పవన్‌

schedule raju

ఆంధ్రప్రదేశ్: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ఉపాధ్యాయుల కు జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్‌ శుభాకాంక్షలు తెలిపారు. ‘జన్మనిచ్చిన అమ్మానాన్నల తరవాత మనకు అంతటి ఆప్యాయత, వాత్సల్యం లభించేది గురు దేవుళ్ళ దగ్గరే. వీసమెత్తు కూడా ప్రతిఫలం ఆపేక్షించకుండా విజ్ఞానాన్ని పంచి… తమ శిష్యుల విజయాలను తమవిగా భావిస్తారని తెలిపారు.

తరగతి గది నుంచే ప్రపంచాన్ని పరిచయం చేసి ఉపాధ్యాయులు, అధ్యాపకులు” శిష్యులను బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్ది, మన దేశ పురోగతిలో తమ వంతు పాత్రను మరింత సమర్థంగా పోషిందాలని ఆకాంక్షిస్తున్నాను అని తెలిపారు.

ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారి పట్ల ఆంధ్రప్రదేశ్‌ పాలకులు, ఉన్నతాధికారులు అనుసరిస్తున్న వైఖరి తరచూ విమర్శల పాలవుతోంది. ఉపాధ్యాయ వర్గంపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందనే మాట వినిపిస్తూనే ఉంది. ప్రభుత్వ చర్యలు సైతం అందుకు అనుగుణంగానే ఉంటున్నాయి. నాడు-నేడు పనుల్లో పాలక పక్షం చేస్తున్న తప్పులకు ప్రధానోపాధ్యాయులను బలి చేస్తున్నారు.

సకాలంలో జీతాలు కూడా చెల్లించలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. పదోన్నతులు పొందిన, బదిలీ అయిన సుమారు 30వేల మంది ఉపాధ్యాయుల కు కొద్ది నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. ఉపాధ్యాయ దినోత్సవం చేసుకొనే ఈ సమయంలో ఏ ఉపాధ్యాయుడికి ఇంకా జీతం చెల్లించలేదు అంటే ఈ ప్రభుత్వానికి గురు దేవుళ్లపై ఏ విధమైన ధోరణిని అవలంభిస్తోందో అర్ధమవుతోంది. రాబోయే రోజుల్లో జనసేన ప్రభుత్వం కచ్చితంగా బోధన వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరి ‘గౌరవ మర్యాదలను‘ కాపాడుతుందని’ విమర్శించారు.