తమిళనాడు లోని సేలంకోయంబత్తూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. రోడ్డు పక్కన నిలిపిన డీసీఎం వాహనాన్ని వేగంగా వచ్చిన ఓమిని వ్యాన్ డీ కొట్టింది. రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఎంగూరుకు చెందిన ఎనిమిది మంది ప్రయాణీస్తున్నారు.
ప్రధానాంశాలు:
- తమిళనాడులోని సేలంకోయంబత్తూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
- బుధవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఓమిని వ్యాన్ డీసీఎంను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
- జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు.
- వ్యాన్ డ్రైవర్ విఘ్నేష్, మరో ఇద్దరు గాయపడ్డారు
రోడ్డు ప్రమాదంలో (Road accident) ఆరుగురు మృతి చెందారు. బుధవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో తమిళనాడులోని సేలం-ఈరోడ్ హైవే పై వేగంగా వెళ్తున్న వ్యాన్ అదుపుతప్పి నిలబడి ఉన్న డీసీఎం ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఎంగూరుకు చెందిన ఎనిమిది మంది ప్రయాణీస్తున్నారు.
ఎంగూరు నుండి పెరుంతురై వైపు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మృతులు సెల్వరాజ్, మంజుల, ఆరుముగం, పళనిస్వామి, పాపతితో పాటు ఏడాది వయస్సున్న చిన్నారి మృతి చెందింది.
సమాచారం అందుకున్న సేలం ఎస్పి అరుణ్ కపిలన్, సంఘకిరి డీఎస్పీ రాజా, తహసీల్దార్ ఇదుడై నంబి ప్రమాద స్థలాన్ని సందర్శించారు. ఈ ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ విగ్నేష్, మరో ప్రయాణికురాలు ప్రియ తీవ్రంగా గాయపడగా, వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తు చేసే సమయంలో రోడ్డుకు సమీపంలోని సీసీటీవీ పుటేజీని పోలీసులు పరిశీలించారు. ఈ సీసీటీవీ పుటేజీలో రోడ్డు ప్రమాదం దృశ్యాలు కన్పించాయి.
మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతి వేగం, డ్రైవర్ నిద్రమత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.