ప్రధానాంశాలు
గుజరాత్: గుజరాత్ (Gujarat) లోని జామ్నగర్లో కోలాటం ఆడుతున్న 19 ఏళ్ల బాలుడు గుండె పోటు తో మరణించాడు. నవరాత్రి కార్యక్రమం కోసం పటేల్ పార్క్ ప్రాంతంలో ఇంజినీరింగ్ విద్యార్థి వినిత్ కున్వరియా అనే బాలుడు రాత్రి కోలాటం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఈ సంఘటన చోటుచేసుకుంది.
Gujarat | పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తొలి రౌండ్ పూర్తయిన తర్వాత వినీత్ ఒక్కసారిగా కుప్పకూలాడు. అతనిని వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ అతని పరిస్థితి విషమించడంతో అతన్ని జిజి ఆసుపత్రికి రెఫర్ చేశారు. అక్కడికి తీసుకువెళ్తుండగా దారిలోనే మృతి చెందినట్లు తెలిపారు.
ట్రైనర్ ధర్మేష్ రాథోడ్ తెలిపిన వివరాలు
వినిత్ యొక్క కోలాటం ట్రైనర్ ధర్మేష్ రాథోడ్ గత రెండు నెలలుగా తరగతులకు వస్తున్నాడని మరియు బాగానే ఉన్నాడని తెలిపారు.
“వినీత్ గత రెండు నెలలుగా నా కోలాటం క్లాసులకు వస్తున్నాడు. కానీ అతను ఆరోగ్యంగానే ఉన్నాడు. నిన్న కూడా అతను కోలాటం ఆడుతూ హఠాత్తుగా నేలపై కుప్పకూలిపోవడంతో మేమంతా భయంతో ఏం జరిగిందనే ఆందోళనలో 108 అంబులెన్స్కు ఫోన్ చేసి ఆసుపత్రికి తీసుకొచ్చాము. కాని దురదృష్టవశాత్తు మేము అతనిని రక్షించలేకపోయాము, ”అని అతను బాధను వ్యక్తం చేశాడు.
ఘజియాబాద్లో ఇదే విధమైన సంఘటన జరిగింది
ఇదే విధమైన సంఘటనలో, 19 ఏళ్ల యువకుడు ఈ నెల ప్రారంభంలో ఘజియాబాద్లోని ఒక వ్యాయామశాలలో ట్రెడ్మిల్పై నడుస్తున్నప్పుడు గుండెపోటు కారణంగా కుప్పకూలి మృతి చెందాడు. సరస్వతీ విహార్లో జరిగిన ఈ దురదృష్టకర ఘటన జరిగింది.
సింగ్ ట్రెడ్మిల్పై వేగాన్ని తగ్గించక అతను క్రమంగా స్పృహ కోల్పోయి, చివరికి మెషీన్పై కుప్పకూలి పోయాడు. సంఘటనా స్థలంలో ఉన్న వారు అతనిని పైకి లేపడానికి ప్రయత్నించారు కానీ అతను అప్పటికే మరణించాడు.