రాజన్న-సిరిసిల్ల: తనను ప్రేమించానంటూ ఓ బాలిక ఇంటి ముందు నిప్పంటించుకుని 23 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆదివారం అర్థరాత్రి బోయిన్పల్లి మండలం స్తంభంపల్లిలో చోటుచేసుకుంది.
నిజామాబాద్ జిల్లా బ్రమ్మనపల్లి జక్రాన్పల్లి గాంధీనగర్కు చెందిన రవితేజ గూడ్స్ క్యారేజ్ వాహనం నడుపుతున్నాడు. ఆదివారం రాత్రి తన వాహనంలో గ్రామానికి వచ్చి బాలిక ఎదుటే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.
బాలిక బంధువుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని సిరిసిల్ల ఆస్పత్రికి తరలించారు.