ప్రధానాంశాలు
ఈరోజు డాషింగ్ అండ్ సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అతనికి శుభాకాంక్షలు తెలుపుతూ, అతని తాజా చిత్రం డబుల్ ఇస్మార్ట్ (Double ISMART) హీరో రామ్ పోతినేని మరియు విలన్ సంజయ్ దత్లతో కలిసి అతను ఉన్న వర్కింగ్ స్టిల్ను విడుదల చేసారు.
ఏపీలోని పిఠాపురంలో 1996 సెప్టెంబర్ 28న పూరీ జగన్నాధ్ జన్మించారు. నేటితో ఆయనకు 55 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన అభిమానులు పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు.
ముగ్గురూ తమ చేతుల్లో డబుల్ రైఫిల్స్ పట్టుకుని కనిపించారు. రామ్ మరియు సంజయ్ దత్ ఇద్దరూ బ్లాక్ షేడ్స్ ఉన్న ఒకే రకమైన దుస్తులు ధరించారు. పూరీ, రామ్ల మునుపటి బ్లాక్బస్టర్ ఇస్మార్ట్ శంకర్కి సీక్వెల్ అయిన ఈ సినిమాలో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నాడు.
Double ISMART స్పెషల్ పోస్టర్
‘మాస్ సినిమాని తనదైన శైలిలో పునర్నిర్వచించిన క్రాఫ్ట్ మెన్… మా సెన్సేషనల్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ కి Double ISMART టీమ్ నుంచి బ్లాక్ బస్టర్ బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నాం’ అంటూ పోస్టర్ ను విడుదల చేశారు. పోస్టర్ లో కేవలం పూరీ జగన్నాథ్ నే కాకుండా రామ్ పోతినేని (Ram Pothineni), ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ (Sanjay Dutt) తో కలిసి ఉన్న పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. గన్స్ పట్టుకొని, ఫైరింగ్ కు రెడీ అనేలా స్టిల్స్ ఇచ్చి ఆకట్టుకున్నారు.
ఫ్యాన్స్ కి బాస్ బ్లాక్ బాస్టర్ తో కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఈ పుట్టిన రోజు తిరుగులేని సక్సెస్ ను ఇవ్వాలని ఆశిస్తున్నారు. ఇక ‘డబుల్ ఇస్మార్ట్’లో రామ్ పోతినేని ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. పూరీ దర్శకత్వం వహిస్తుండగా, ఛార్మీ కౌర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమం పూర్తి చేసుకొని, రామ్ పోతినేని, సంజయ్ దత్ ఫస్ట్ లుక్ పోస్టర్లు కూడా మేకర్స్ విడుదల చేసారు. అలాగే 2024 మార్చి 8న ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయబోతున్నట్టు తెలిపారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.