Home   »  నేరాలు   »   వనస్థలిపురంలో భార్యను రాయితో కొట్టి చంపిన భర్త..!

వనస్థలిపురంలో భార్యను రాయితో కొట్టి చంపిన భర్త..!

schedule sirisha

వనస్థలిపురం | Brutal murder : వనస్థలిపురంలోని విజయపురి కాలనీ ఫేజ్‌-1లో అక్టోబర్‌ 6న ఓ మహిళను ఆమె భర్త అతి దారుణంగా హత్య చేసిన ఘటన సంచలనం రేపుతుంది.

శాతవాహన నగర్‌కు చెందిన శాలిని (32), ఆమె భర్త బాల కోటయ్య దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యాభర్తలు తరచూ చిన్న చిన్న విషయాలపై గొడవ పడుతు ఉండేవారు.

Brutal murder | కోటయ్య రాయితో కొట్టి చంపిన చంపాడు

శుక్రవారం శాలిని రాత్రి స్కూటర్‌ పై అక్క ఇంటికి వెళ్తుండగా బాల కోటయ్య ఆమె వాహనాన్ని ఆపి ఆమెతో గొడవపడ్డాడు. గొడవ తీవ్రరూపం దాల్చడంతో కోటయ్య ఆమెను బాగా కొట్టి కింద పడేసి బండరాయిని పట్టుకుని ఆమె తలపై వేసాడు. దీంతో ఆమె తలకు దెబ్బతగిలి తీవ్ర రక్తస్రావమవడంతో మరణించింది.

సమాచారం అందుకున్న వనస్థలిపురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను చూస్తామని వెల్లడించారు.