హైదరాబాద్: నెహ్రూ జూ పార్క్ (Nehru Zoo Park) లో ఏనుగు దాడి చేయడంతో అక్టోబరు 7వ తేదీ శనివారం ఉదయం జంతు సంరక్షకుడు మరణించాడు. అనారోగ్యంతో బాధపడుతున్న మొహెద్ షాబాజ్ (22) ఏనుగుల సంరక్షణ కేంద్రంలో దాదాపు రెండేళ్లుగా జంతు సంరక్షణాధికారిగా పని చేస్తున్నాడు.
శనివారం మధ్యాహ్నం, షాబాజ్ తన దినచర్యలో భాగంగా ఏనుగు వద్దకు వెళ్లాడు. ఏనుగు అతని వైపు ఒక్కసారిగా రావడంతో ఏనుగు దంతం అతనికి తల భాగంలో గుచ్చింది. దీంతో తీవ్ర రక్తస్రావం జరుగుతుండడంతో వెంటనే పార్క్ అధికారులు ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా అతను మార్గం మధ్యలోనే మరణించినట్లు వైద్యులు తెలిపారు.
ఏనుగుల దాడిపై నెహ్రూ జూలాజికల్ పార్క్ అధికారులు విచారణకు ఆదేశించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also read :వనస్థలిపురంలో భార్యను రాయితో కొట్టి చంపిన భర్త..!