ప్రధానాంశాలు.
హైదరాబాద్: నేడు ఆదిలాబాద్లో జరిగే BJP ‘జన గర్జన’ బహిరంగ సభలో కేంద్ర మంత్రి అమిత్ షా ప్రసంగిస్తారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ మహబూబ్నగర్, నిజామాబాద్లో నిర్వహించిన సమావేశాలతో ఊపందుకున్న రాష్ట్ర బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రానున్న 50 రోజుల్లో దాదాపు 40 బహిరంగ సభలను నిర్వహించేందుకు సిద్ధమైంది.
అక్టోబర్ మూడవ వారంలో తెలంగాణలో పర్యటన..
మరో బిజెపి ప్రముఖుడు,పార్టీ ప్రచారకర్తలలో ముఖ్యుడు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అక్టోబర్ మూడవ వారంలో తెలంగాణలో పర్యటించి రెండు బహిరంగ సభలలో ప్రసంగిస్తారని కిషన్రెడ్డి భావిస్తున్నారు. బహిరంగ సభలలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ తదితరులు పాల్గొంటారు.
BJP పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యం : కిషన్రెడ్డి
కాగా, ఐదుగురు కేంద్రమంత్రులు, ఎంపీలు, ఇతర రాష్ట్రాలకు చెందిన సీనియర్ నేతలతో కూడిన 26 మంది సభ్యులతో పార్టీ నియమించిన ఎన్నికల కమిటీ ఎన్నికల ప్రచారం ముగిసే వరకు తెలంగాణలోనే ఉంటుందని తెలిపారు. 14 కమిటీలు అభ్యర్థుల పరిశీలన, ప్రచారం సమన్వయం, ముసాయిదా మ్యానిఫెస్టో తయారీ వంటి విభిన్న విధులను నిర్వహిస్తాయి. పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా శ్రేణులు అంకితభావంతో పనిచేస్తాయని కేంద్రమంత్రి, రాష్ట్ర పార్టీ చీఫ్ జి కిషన్రెడ్డి అన్నారు.