Home   »  జాతీయం   »   Uttar Pradesh: చెల్లెళ్లను చంపిన అక్క అసలు ఏం జరిగింది..?

Uttar Pradesh: చెల్లెళ్లను చంపిన అక్క అసలు ఏం జరిగింది..?

schedule ranjith

ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) లోని బల్రాయ్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. చెల్లెళ్లు అక్కని తన ప్రియుడితో సన్నిహితంగా ఉండటం చూశారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్తారనే భయం తో చెల్లెళ్లును హతమార్చింది.

Uttar Pradesh లోని బల్రాయ్ పోలీస్ స్టేషన్‌లో ఘటన

తల్లిదండ్రులు ఇంట్లో లేకపోవడంతో ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంది యువతి. వారిద్దరూ సన్నిహితంగా ఉండడం చెల్లెళ్ల చూశారు. ఈ విషయాన్ని వారు తల్లిదండ్రులకు చెపుతారు కావచ్చు అని భయంతో చెల్లెళ్లను దారుణంగా హతమార్చింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బల్రాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అధికారుల ప్రకారం బహదూర్‌పూర్ గ్రామానికి చెందిన అంజలి (20) కొంత కాలంగా ఓ యువకుడిని ప్రేమిస్తోంది.

తల్లిదండ్రులు లేకపోవడంతో ప్రియుడిని ఇంటికి పిలిపించుకున్న యువతి

ఇటీవల తల్లిదండ్రులు ఊరికి వెళ్లడంతో ప్రియుడికి ఫోన్ చేసి నేరుగా ఇంటికి పిలిపించుకుంది. అతడితో సన్నిహితంగా ఉండగా ఆమె చెల్లెళ్ల చూశారు. దీంతో ఈ విషయాన్ని వారు తల్లిదండ్రులకు చెపుతారు కావచ్చు అని భయంతో పదునైన ఆయుధంతో వారిని హతమార్చింది. చనిపోయిన వారి వయస్సు ఒకరిది ఆరు సంవత్సరాలు మరొకరిది నాలుగు సంవత్సరాల వయస్సు ఉంటుంది.

దుస్తులపై రక్తపు మరకలతో దొరికిపోయిన నిందితురాలు

ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు చెల్లెళ్లను ఎవరో చంపేశారని చెప్పి వారిని నమ్మించే ప్రయత్నం చేసింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో అంజలి దుస్తులపై రక్తపు మరకలు ఉండడాన్ని గుర్తించిన అధికారులు నిలదీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు అంజలిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Read: సైబర్ కేటుగాళ్ల చేతిలో మరో మహిళా…!