ప్రధానాంశాలు..
హైదరాబాద్: ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు సమ్మెటివ్ ఎసెస్మెంట్ పరీక్షలు ముగియడంతో పాఠశాలలకు రేపటి నుంచే దసరా (Holidays)సెలవులిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
దసరా పండుగ సందర్బంగా పాఠశాలలకు13 రోజులు(Holidays)సెలవులు
2023-24 విద్యా సంవత్సరానికి పాఠశాల విద్యా శాఖ ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం, రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు అక్టోబర్ 25 వరకు దసరా పండుగకు 13 రోజుల సెలవులు ఉంటాయి.
జూనియర్ కాలేజీలకు దసరా సెలవులు అక్టోబర్ 19 నుంచి ప్రారంభం..
రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలకు దసరా సెలవులు ప్రకటిస్తూ అక్టోబర్ 19 నుంచి 25 వరకు ఎలాంటి ప్రత్యేక తరగతులు నిర్వహించరాదని టీఎస్ బీఐఈ స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ప్రైవేట్ అన్ ఎయిడెడ్ సంస్థలతోపాటు అన్ని జూనియర్ కాలేజీల ప్రిన్సిపాల్స్కు బోర్డు ఆదేశాలు జారీ చేసింది.
దసరా పండగ తరువాత రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కాలేజీలు తిరిగి అక్టోబర్ 26న తెరవబడతాయి.