Home   »  రాజకీయం   »   MP vaddiraju :నవంబరు 5న కొత్తగూడెంలో ప్రజా ఆశీర్వాద సభ ను విజయవంతం చేయాలి..

MP vaddiraju :నవంబరు 5న కొత్తగూడెంలో ప్రజా ఆశీర్వాద సభ ను విజయవంతం చేయాలి..

schedule mounika

కొత్తగూడెం: నవంబరు 5న కొత్తగూడెంలో జరగనున్న ముఖ్యమంత్రి KCR ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని (mp vaddiraju)ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పార్టీ కార్యకర్తలను, నాయకులను కోరారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఘనమైన బహుమతి అందజేస్తాం : mp vaddiraju

రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ ‘ఆరు హామీ పథకాలు’ కేవలం ఎన్నికల నాటకాలు మాత్రమేనని విమర్శించారు. ఈ హామీ పథకాలు కర్ణాటక రాష్ట్రంలో ఘోరంగా విఫలమయ్యాయని ఆరోపించారు. వచ్చే అసంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి అఖండ విజయం సాధిస్తారని, తద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఘనమైన బహుమతిని అందజేస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేయాలి : ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

నవంబరు 5న కొత్తగూడెంలో KCR ప్రజా ఆశీర్వాద సభ ను విజయవంతం చేయాలన్నారు. ఈ మహత్తర కార్యక్రమానికి 80,000 మందికి పైగా ప్రజానీకం హాజరవుతారని రవిచంద్ర విశ్వాసం వ్యక్తం చేశారు. కొత్తగూడెం మున్సిపాలిటీ, కొత్తగూడెం, సుజాతనగర్, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, పాల్వంచ మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలతో జరిగిన వరుస సమావేశాల్లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేయాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కోరారు.

అనంతరం BRS కొత్తగూడెం అసెంబ్లీ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. కొత్తగూడెం అభివృద్ధికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని కొనియాడారు. BRS ప్రభుత్వం అంకితభావంతో చేసిన కృషి వల్లే ఈ అద్భుతమైన మెరుగుదలలు సాధ్యమయ్యాయని వెంకటేశ్వరరావు తెలిపారు.