ప్రధానాంశాలు
బ్రిటన్ : హమాస్ మిలిటెంట్లతో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్లో ఇవాళ బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ (PM Rishi Sunak) పర్యటనకు వెళ్లనున్నారు. ఈ మేరకు బ్రిటన్ ప్రధాని కార్యాలయం వెల్లడించింది.
ఇజ్రాయెల్ ప్రధాని భేటీ కానున్నPM Rishi Sunak
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు, అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్తో సమావేశమవుతారని వెల్లడించారు. కాగా హమాస్ తీవ్రవాద దాడులను ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్లో బుధవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పర్యటించిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా బైడెన్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, అధ్యక్షుడితో సమావేశం అయ్యారు. యుద్ధ పరిస్థితుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. యుద్ధం నేపథ్యంలో తర్వాత చేపట్టాల్సిన చర్యలపైనా చర్చించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
హమాస్ దాడుల్లో ఇజ్రాయెల్ వైపు 1,300 మందికి పైగా మృతి
మరోవైపు ఈ యుద్ధంతో రెండు దేశాల్లో మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ పోతుంది. హమాస్ దాడుల్లో ఇజ్రాయెల్ వైపు 1,300 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా, ఇక ఇజ్రాయెల్ దాడులతో గాజాలో మరణాల సంఖ్య అంతకంతకూ రెట్టింపవుతుంది. ఇప్పటి వరకూ గాజా లో 3000 మందికిపైగా మరణించారు. వేల సంఖ్యలో ప్రజలు గాయపడగా సుమారు 10 లక్షల మందికిపైగా ప్రజలు గాజాను వీడి వెళ్లి పోయారు.