ప్రధానాంశాలు
హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మూడు రోజుల ప్రచారంలో ఉండగా కాంగ్రెస్(Congress)అసంతృప్తి నేతలు కలకలం రేపుతున్నారు.
ED ఆశ్రయించిన కాంగ్రెస్ అసంతృప్తి నేతలు..
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ రాకపోవడంతో పలువురు కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. తమ కోపాన్ని వెళ్లగక్కేందుకు పలువురు ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని ఆశ్రయించారు, మనీలాండరింగ్ ఆరోపణలపై రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. “వారు టిక్కెట్లు అమ్మారు. ఇది ఎక్కువ కాలం కొనసాగదు” అని కుర్వ విజయ కుమార్ వ్యాఖ్యానిస్తూ, మరో కాంగ్రెస్ నాయకుడు కలీం బాబాతో కలిసి EDకి మెమోరాండం( వ్రాతపూర్వక ప్రకటన, రికార్డు )సమర్పించినట్లు ది సౌత్ ఫస్ట్ తన నివేదికలో పేర్కొంది.
రేవంత్రెడ్డిపైనే కాకుండా పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్, తెలంగాణ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రేలపై కూడా చర్యలు తీసుకోవాలని కోరినట్లు వారు తెలిపారు.
టికెట్ కోసం నగదు’ ఆరోపణలు కాంగ్రెస్ సీనియర్ నేతలు అవినీతి, మనీలాండరింగ్కు పాల్పడుతున్నారని ఈడీకి ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా, బెంగళూరులో జరిగిన సోదాల్లో ₹42 కోట్లు స్వాధీనం చేసుకున్నామని, ఇప్పటికే ₹ 8 కోట్లు రేవంత్ రెడ్డికి చెందిన “రహస్య మూలాలకు” చేరాయని కూడా వారు పేర్కొన్నారు. కాగా, ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన రాగిడి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్లో చేరారు. ఈయన గతంలో రేవంత్ రెడ్డిపై E.Dకి ఫిర్యాదు చేయడంతో కాంగ్రెస్ నుండి సస్పెండ్ అయ్యారు.
కాంగ్రెస్(Congress) కు ఓటమి తప్పదు:కాంగ్రెస్ నేతలు హెచ్చరిక
కూకట్పల్లి నుంచి 16 మంది కాంగ్రెస్ నేతలు టికెట్పై ఆశలు పెట్టుకున్నారు. తమకు టికెట్ ఇవ్వకుంటే మళ్లీ కాంగ్రెస్కు ఓటమి తప్పదని పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారు.