ప్రధానాంశాలు
న్యూఢిల్లీ : ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో భారత్కు సంబంధం ఉందని కెనడా ఆరోపించింన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్ కెనడాకు చెందిన 41 మంది దౌత్యవేత్తలను తిరిగి కెనడా కు వెళ్లిపోవాలని కేంద్రం అల్టిమేటం జారీచేసిన విషయం కూడా అందరికి తెలిసిందే.
భారత్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టిన అమెరికా,బ్రిటన్ (America-Britain)
ఈ క్రమంలో కెనడా దౌత్యవేత్తలు వారి దేశానికి వెళ్లిపోయారు. అయితే ఈ విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా, బ్రిటన్ (America-Britain) తప్పుబట్టాయి. భారత్ కెనడా యొక్క దౌత్య సిబ్బంది సంఖ్యను తగ్గించుకోవాలన్న భారత డిమాండ్ను తమకు ఆందోళన కలిగిస్తోందని రెండు దేశాల విదేశాంగ శాఖలు తెలిపాయి.
హర్దీప్ సింగ్ నిజ్జర్ను కాల్చిచంపడం వెనుక భారత్ హస్తం:కెనడా
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ను కాల్చిచంపడం వెనుక భారత ప్రభుత్వ హస్తం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సెప్టెంబర్లో ఆరోపించడంతో భారత్, కెనడా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. భారతదేశం ఈ వాదనలను సరిగ్గా తిరస్కరించింది, దీనిని ‘అసంబద్ధం’ మరియు ‘ప్రేరేపితమైనది’ అని పేర్కొంది. ముఖ్యంగా, నిజ్జర్ హత్యకు సంబంధించిన వాదనకు మద్దతుగా కెనడా ఇంకా ఎలాంటి బహిరంగ సాక్ష్యాధారాలను అందించలేదు.