ప్రధానాంశాలు
J&K: జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి కాల్పులకు తెగ పడ్డారు. దక్షిణ కశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో ఉత్తరప్రదేశ్ కి చెందిన వలస కార్మికుడు ముఖేష్ని కాల్చి చంపేశారు. ఈ విషయాన్ని కశ్మీర్ జోన్ పోలీసులు వెల్లడించారు.
మృతుడు UP కి చెందిన ముఖేష్గా గుర్తింపు
పుల్వామాలోని తుమ్చి నౌపోరా ప్రాంతంలో యుపికి చెందిన ముఖేష్గా గుర్తించబడిన కార్మికుడిపై ఉగ్రవాదులు కాల్పులు జరపడం జరిగింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన సదరు కార్మికుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
కాశ్మీర్ లోయలో జరిగిన రెండో ఉగ్రదాడి (Terrorists attack)
గత 24 గంటల్లో కాశ్మీర్ లోయలో జరిగిన రెండో ఉగ్రదాడి (Terrorists attack) కాగా, దీనికి ముందు శ్రీనగర్లోని ఈద్గా ప్రాంతంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపి ఒక పోలీసు అధికారిని తీవ్రంగా గాయపరిచారు.
ఈద్గా మైదానంలో స్థానిక నివాసితులతో క్రికెట్ గేమ్లో పాల్గొన్న ఇన్స్పెక్టర్ మస్రూర్ అహ్మద్ వనీకి మూడు తుపాకీ గాయాలు తగిలాయి.
కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్
అంతకుముందు అక్టోబర్ 26న జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలో మచల్ సెక్టార్లో ఉగ్రవాదులు, భద్రతా సిబ్బంది మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారని పోలీసులు వెల్లడించారు.అధికారులు సెర్చ్ ఆపరేషన్ ను కొనసాగిస్తున్నారు.