ప్రధానాంశాలు
ఒడిశా రాజధాని భువనేశ్వర్లో 4 ఏళ్ల బాలికను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. ఈ ఘటన భువనేశ్వర్లోని ఎయిర్ఫీల్డ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది.
Bhubaneswar దినసరి కూలీగా పనిచేస్తున్న బాలిక తల్లిదండ్రులు
దినసరి కూలీగా పనిచేస్తున్న బాలిక తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో పని ముగించుకుని ఇంటికి వచ్చేసరికి కూతురు రక్తపు మడుగులో పడి ఉంది. సోమవారం అర్థరాత్రి సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం క్యాపిటల్ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
నిందితులను పట్టుకునేందుకు పోలీసులు స్పెషల్ స్క్వాడ్
నిందితులను పట్టుకునేందుకు పోలీసులు, స్పెషల్ స్క్వాడ్ గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. హత్యకు గురైన సంఘటన పై స్థానికులను పోలీసులు ఆరా తీస్తున్నారు. బాలిక చాక్లెట్ కొని తన ఇంటికి వెళ్లడం చివరిసారిగా చూశానని స్థానిక దుకాణదారుడు పోలీసులకు తెలిపాడు. దుకాణదారు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక మురికివాడకు చెందిన గనియా అనే యువకుడు దుకాణంలో రెండు చాక్లెట్లు తీసుకున్నాడు.
గనియా అనే వ్యక్తి పై అనుమానం
గనియా ఈ నేరానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో నిందితుడు గనియాను పట్టుకునేందుకు పలు ప్రాంతాల్లో వెతుకుతున్నారు. మురికివాడ వాసులను విచారిస్తున్నారు. నిందితుడు అత్యాచారం చేసి చిన్నారిని హత్య చేశారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. అయితే పోస్టుమార్టం నివేదిక వచ్చే వరకు ఏమీ చెప్పలేమని పోలీసులు తెలిపారు.
Also Read: Mathura: ఓ వ్యక్తిని హతమార్చేందుకు వచ్చిన 11 మంది అరెస్ట్