Home   »  తెలంగాణ   »   గజ్వేల్ నుంచి నామినేషన్ దాఖలు చేసిన సీఎం కేసీఆర్

గజ్వేల్ నుంచి నామినేషన్ దాఖలు చేసిన సీఎం కేసీఆర్

schedule mounika

హైదరాబాద్: నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (KCR)గురువారం గజ్వేల్‌లో నామినేషన్ దాఖలు చేశారు.


కామారెడ్డిలో KCR నామినేషన్ దాఖలు..

కేసీఆర్ మధ్యాహ్నం కామారెడ్డి నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉందని, ఆ తర్వాత ఎన్నికల ర్యాలీ ఉంటుందని అధికారిక వర్గాలు తెలిపాయి.

కాగా, నవంబర్ 4వ తేదీన సిద్దిపేట జిల్లా కోనాయిపల్లి శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయడానికి ముందు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలోని గర్భగుడిలో నామినేషన్ పత్రాలను ఉంచి పూజలు నిర్వహించారు.

నవంబర్ 13 నుండి కేసీఆర్ పర్యటన ప్రారంభం..

దీపావళికి కొంత విరామం తర్వాత,కేసీఆర్ నవంబర్ 13 నుండి తన పర్యటనలను తిరిగి ప్రారంభిస్తారు. ఎన్నికల కోసం నవంబర్ 13 నుంచి 28 వరకు 54 ‘ప్రజా ఆశీర్వాద’ సమావేశాల్లో ఆయన ప్రసంగించనున్నారు.