Home   »  జాతీయం   »   Gujarat Road Accident: గుజరాత్‌లోని పంచమహల్ హైవేపై జరిగిన బస్సు ప్రమాదంలో నలుగురు మృతి.. 11 మంది గాయాలు

Gujarat Road Accident: గుజరాత్‌లోని పంచమహల్ హైవేపై జరిగిన బస్సు ప్రమాదంలో నలుగురు మృతి.. 11 మంది గాయాలు

schedule ranjith

Gujarat Road Accident | మంగళవారం గుజరాత్‌లోని పంచమహల్ జిల్లాలోని గోద్రా పట్టణం సమీపంలో ప్రైవేట్ లగ్జరీ బస్సు డ్రైవర్ ఆగివున్న ఉన్న మరో బస్సును చూడక దానిని ఢీకొట్టినట్లు అధికారి తెలిపారు.

Gujarat Road Accident: Four killed, 11 injured in bus accident on Panchmahal highway in Gujarat

గోద్రా పట్టణానికి సమీపంలో ఉన్న హైవేపై ఈ ఘటన

గుజరాత్‌లోని పంచమహల్ జిల్లాలోని గోద్రా పట్టణానికి సమీపంలో ఉన్న హైవేపై మంగళవారం ప్రైవేట్ లగ్జరీ బస్సు , నిలిచిఉన్న మరో బస్సును ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు మరణించారు, 11 మంది గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపారు. ఇండోర్‌కు వెళ్లే బస్సు సాంకేతిక లోపంతో వాహనం ఆగిపోవడంతో రోడ్డు పక్కన మరమ్మతులు చేస్తుండగా తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో దాహోద్-గోధ్రా హైవేపై ఈ ప్రమాదం జరిగిందని గోద్రా సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ ప్రవీణ్‌సింగ్ జయతావత్ తెలిపారు.

ప్రమాదంలో మరో 11 మందికి గాయాలు (Gujarat Road Accident)

దాహోద్ నుండి వస్తున్న లగ్జరీ బస్సు డ్రైవర్, ఎదురుగా ఉన్న బస్సును గుర్తించలేకపోయాడు మరియు ఆగి ఉన్న బస్సును వెనుక నుండి ఢీకొట్టాడు. నలుగురు ప్రయాణికులు అక్కడిక్కడే మరణించారు. చనిపోయిన వారిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పిల్లలు గా గుర్తించారు. ప్రమాదంలో మరో 11 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరిలో తొమ్మిది మంది గోద్రాలోని సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని వైద్య సహాయం కోసం వడోదరకు తరలించినట్లు అధికారి తెలిపారు.

Also Read: Uttar Pradesh News: ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరుతూ ముస్లిం కార్యకర్త నిరసన