హర్యానాలోని భివానిలో ఇంటి బయట నిల్చున్న వ్యక్తిపై కొందరు వ్యక్తులు కాల్పులు జరిపైన ఘటన కలకలం రేపింది.ఆ వ్యక్తి కొన్ని గాయాలతో తప్పించుకున్నాడు.
ప్రధానాంశాలు
ఇంటి బయట నిల్చున్న బాధితుడిపై బైక్పై వచ్చి దుండగుల Firing
హర్యానాలో ఇంటి బయట నిల్చున్న వ్యక్తిపై బైక్పై వచ్చిన దుండగులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. అతడు కష్టంమీద వారి నుంచి తప్పించుకుని ఇంట్లోకి పరిగెత్తాడు. తప్పించుకునే క్రమంలో కొన్ని తూటాలు అతడి శరీరంలో దిగాయి.
కాల్పుల శబ్దానికి బయటకు వచ్చి తరమికొట్టిన పక్కింటి మహిళ
ఈ సమయంలో కాల్పుల శబ్దం విన్న పొరుగింటి మహిళ పొడవాటి చీపురుకర్రతో బయటకు వచ్చి దుండగులవైపు దూసుకెళ్లింది. ఆమెను అడ్డుకునేందుకు కాల్పులు జరిపినా సరే ఆమె వెరవలేదు. చివరికి దుండగులు పారిపోక తప్పలేదు.
హర్యానాలోని భివానీలో జరిగిన ఘటన
హర్యానాలోని భివానీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. బాధితుడిని పోలీసులు హరికిషన్గా గుర్తించారు. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్తో హరికిషన్కి సంబంధం ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. ఓ హత్య కేసులో నిందితుడైన హరికిషన్ ప్రస్తుతం బెయిలుపై బయట ఉన్నాడు. దుండగుల కాల్పుల్లో గాయపడిన హరికిషన్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిందితుల కోసం పోలీసులు గాలింపు ప్రారంభించారు.
Also Read: ఎలుగుబంటి దాడిలో ప్రాణాలు కోల్పోయిన జూ సంరక్షకుడు