Home   »  అంతర్జాతీయం   »   గాజాతో యుద్దం కొనసాగుతుందని తేల్చి చెప్పిన ఇజ్రాయెల్

గాజాతో యుద్దం కొనసాగుతుందని తేల్చి చెప్పిన ఇజ్రాయెల్

schedule mahesh

Israel Gaza war: ఇజ్రాయెల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇజ్రాయెల్ గాజా తో యుద్దం కొనసాగుతుందని వెల్లడించింది. ఇజ్రాయెల్ కు అంతర్జాతీయ మద్దతు ఉన్నా, లేకున్నా ఈ యుద్దంలో తాము ముందుకు కదులుతామని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఇలీ కోహెన్ వెల్లడించారు.

Israel Gaza war

ఇజ్రాయెల్ కు USతో పాటు EU దేశాల మద్దతు ఉందన్న ఇలీ కోహెన్

ప్రస్తుత దశలో కాల్పుల విరమణ అనేది ఉగ్రవాద సంస్థ హమాస్‌కు ఒక బహుమతిలా మారనుందని మంత్రి ఇలీ కోహెన్ తెలిపారు. కాల్పుల విరమణ ఒప్పందం అనేది ఇజ్రాయెల్ ప్రజలను బెదిరించేలా హమాస్ మిలిటెంట్లకు అవకాశం కల్పిస్తుందన్నారు. ఇజ్రాయెల్ కు అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ తో పాటు పలు దేశాల మద్దతు వుందని వెల్లడించారు. కానీ క్రమంగా ఆ మద్దతు తగ్గిపోతోందని తెలిపారు.

ఇటీవల గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న విచక్షణ రహిత బాంబు దాడులే దానికి కారణమంటూ తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై హమాస్ మిలిటెంట్లు అనూహ్యంగా దాడికి పాల్పడ్డారు. ఇజ్రాయెల్ లో విధ్వంసం సృష్టించి అక్కడి పౌరులను బందీలుగా తమతో తీసుకెళ్లారు. దీనికి ప్రతిస్పందనగా గాజాపై ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించింది.

Israel Gaza warలో 18,600 మందికి పైగా మృతి

ఇజ్రాయెల్-హమాస్ మిలిటెంట్ల మధ్య యుద్దం ప్రారంభమై మూడు నెలలు అవుతుంది. ఈ యుద్దంలో సుమారు 18,600 మందికి పైగా మృతి చెందారని హమాస్ ఆధ్వర్యంలో నడిచే ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వారిలో మహిళలు, పిల్లలే అధికంగా ఉన్నట్టు వెల్లడించింది. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో హమాస్ లో అపారమైన నష్టం జరిగిందని వెల్లడించింది.