పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) స్పందించారు. ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మరణించడం అత్యంత విషాదకరం అని పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మరణించడం అత్యంత విషాదకరం: Chandrababu Naidu
పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) స్పందించారు. ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మరణించడం అత్యంత విషాదకరం అని పేర్కొన్నారు. అంగన్ వాడీల పోరాటానికి మద్దతు తెలిపి అంతలోనే అనంతలోకాలకు వెళ్లిపోవడం విచారకరం అని తెలిపారు.
తన చివరి ఘడియల్లో సైతం ప్రజాసేవలోనే గడిపిన షేక్ సాబ్జీ మృతికి తీవ్ర సంతాపం ప్రకటిస్తున్నానని చంద్రబాబు వివరించారు. ఈ విషాద సమయంలో సాబ్జీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు.
కాగా, పశ్చిమగోదావరి జిల్లా చెరుకువాడ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పీడీఎఫ్ పార్టీ ఎమ్మెల్సీ షేక్సాబ్జీ మృతి చెందారు. ఆయన కారు ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న సమ్మెకు మద్దతు తెలిపి షేక్సాబ్జీ తన వాహనంలో ఏలూరు నుంచి భీమవరం వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం.
దురదృష్టవశాత్తు, అతను సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని ఘటనపై విచారణ ప్రారంభించారు. సబ్జీ కారు డ్రైవర్, గన్మెన్, పీఏలకు తీవ్ర గాయాలు కాగా, వారిని ఆస్పత్రికి తరలించారు.