Home   »  తెలంగాణ   »   మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ..

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ..

schedule mounika

సిద్దిపేట జిల్లా రైతాంగానికి యాసంగి పంటకు నీళ్లు అందించాలని, అందుకు అవసరమైన నీటిని మిడ్ మానెర్ నుండి రంగనాయక సాగర్ కి పంప్ చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎమ్మెల్యే హరీశ్ రావు(MLA Harish Rao) బహిరంగ లేఖ రాశారు.  

MLA Harish Rao

యాసంగి పంటకు సాగు నీటిని ఇవ్వాలి: MLA Harish Rao

రంగనాయక సాగర్ రిజర్వాయర్‌లోకి మిడ్ మానేరు నుండి 1.50 TMC నీటిని పంప్ చేసి యాసంగి పంటకు సాగు నీటిని ఇవ్వాలని B.R.S ఎమ్మెల్యే హరీష్ రావు ప్రభుత్వానికి విజ్ణప్తి చేశారు. సిద్దిపేట జిల్లా రైతాంగానికి యాసంగి పంటకు నీళ్లు అందించాలని అందుకు అవసరమగు నీటిని మిడ్ మానేర్ నుంచి రంగనాయక సాగర్‌ కి నీటిని పంపు చేయాలని సిద్దిపేట M.L.A హరీష్ రావు కోరారు. ఈ మేరకు రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి హరీష్ రావు లేఖ రాశారు.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ అందజేసిన హరీష్ రావు..

ఈ మేరకు శనివారం రోజున శాసనసభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి హరీష్ రావు లేఖ అందజేశారు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వంలో తెలంగాణకు అత్యంత ముఖ్యమైన నీటిపారుదలశాఖా మాత్యులుగా బాధ్యతలు చేపట్టిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎమ్మెల్యే హరీష్ రావు (MLA Harish Rao) శుభాకాంక్షలు తెలిపారు.

కాగా, సిద్దిపేట జిల్లా రైతాంగ ప్రయోజనాలకు సంబంధించిన ముఖ్యమైన విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. గత మూడు సంవత్సరాలుగా జిల్లాలో సాగు భూములకు రంగనాయక సాగర్ ద్వారా సాగునీరు అందజేయడం జరిగిందన్నారు. దీని వల్ల పంట దిగుబడి పెరిగి రైతుల బతుకుల్లో సంతోషం నిండిందన్నారు.

యాసంగికి నీళ్లు అందించాలంటే మూడు TMC ల నీరు ఉండాలి: హరీష్ రావు

ఈ యేడు వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో యాసంగి పంటకు సరిపోయే నీరు రిజర్వాయర్ లో లేక రైతాంగం ఆందోళనకు గురవుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. యాసంగికి నీళ్లు అందించాలంటే మూడు TMC ల నీరు ఉండాలన్నారు.

కానీ ప్రస్తుతం రంగనాయక సాగర్ రిజర్వాయర్ లో 1.50 TMC ల నీరు మాత్రమే ఉందన్నారు. రైతాంగ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని వెంటనే మిడ్ మానేరు నుండి 1.50 TMC ల నీళ్లు రంగనాయక సాగర్ కు వచ్చే విధంగా పంపింగ్ చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించవలసిందిగా లేఖ ద్వారా తెలిపారు. గత మూడు సంవత్సరాలుగా అందించిన విధంగానే ఈ సారి కూడా యాసంగి పంటకు కావలసిన సాగునీరు అందే విధంగా చర్యలు చేపట్టవలసిందిగా సిద్ధిపేట జిల్లా రైతాంగం పక్షాన హరీష్ రావు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని కలసి లేఖ అందజేసి విజ్ఞప్తి చేశారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డికి హరీష్ రావు రాసిన లేఖ..

Image

ALSO READ: కాంగ్రెస్ సాధ్యం కాని వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేసింది:KTR