వచ్చే ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల విషయంలో YSRCP నాయకత్వం మార్పులు, చేర్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ నియోజకవర్గాల ఇంఛార్జీల నాలుగో జాబితాను విడుదల చేసింది.
తాజాగా వైఎస్ఆర్సీపీ నాలుగో అసెంబ్లీ నియోజకవర్గాల ఇంఛార్జీల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఎస్సీ రిజర్వుడులో ఒక MP అభ్యర్థిని, 7 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను మార్చింది. ఐదుగురు సిట్టింగ్ లకు టికెట్లు ఇచ్చేందుకు నిరాకరించింది.
సీట్లు కోల్పోయిన వారిలో నలుగురు ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి, శింగనమల MLA జొన్నలగడ్డ పద్మావతి, మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి, కనిగిరి MLA బుర్రా మధుసూదన యాదవ్ లకు టికెట్లను నిరాకరించారు.
డిప్యూటీ సీఎం, గంగాధర నెల్లూరు MLA నారాయణస్వామిని చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జీగా నియమించారు.
YSRCP అసెంబ్లీ నియోజకవర్గాల ఇంఛార్జీల నాలుగో జాబితా..
- జీడీ నెల్లూరు (ఎస్సీ): N. రెడ్డప్ప
- శింగనమల (ఎస్సీ): M. వీరాంజనేయులు
- తిరువూరు (ఎస్సీ): నల్లగట్ల స్వామిదాసు
- కొవ్వూరు (ఎస్సీ): తలారి వెంకట్రావు
- నందికొట్కూరు (ఎస్సీ) సుధీర్ ధార
- గోపాలపురం (ఎస్సీ): తానేటి వనతి
- చిత్తూరు పార్లమెంట్ (ఎస్సీ): K. నారాయణస్వామి
- మడకశిర(ఎస్సీ): ఈర లక్కప్ప
- కనిగిరి: దద్దాల నారాయణ యాదవ్.
ALSO READ: ఈనెల 21న AP కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించనున్న షర్మిల..