Gold | ఓ మహిళా ప్రయాణికురాలు శానిటరీ ప్యాడ్లో అక్రమంగా బంగారాన్ని తరలిస్తుండగా అహ్మదాబాద్ ఎయిర్పోర్టు అధికారులు పట్టుకున్నారు. అబుదాబి నుంచి వచ్చిన ఆ ప్రయాణికురాలి నుంచి 73 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.
Gold | బంగారం తరలిస్తూ పట్టుబడిన మహిళ
అహ్మదాబాద్: శానిటరీ ప్యాడ్లో అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఓ మహిళా ప్రయాణికురాలిని అహ్మదాబాద్ విమానాశ్రయ అధికారులు పట్టుకున్నారు. అబుదాబి నుంచి వచ్చిన ప్రయాణికురాలి దగ్గరి నుంచి 73 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. బంగారం రూ. 49 లక్షల విలువ ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే ఈ బంగారాన్ని శానిటరీ ప్యాడ్లో దాచి అక్రమంగా తీసుకెళ్తున్నట్లు తెలిపారు.
అబుదాబి మహిళా ప్రయాణికురాలు శానిటరీ ప్యాడ్లో బంగారం తీసుకెళ్తున్నట్లు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులకు పక్కా సమాచారం అందింది. దీంతో విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయిన వెంటనే ప్రతి ప్రయాణికురాలిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనంతరం మహిళా ప్రయాణికురాలి నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని పేస్ట్ రూపంలో తీసుకొచ్చినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.
Also read: Haryana Crime News | ఉజ్బెకిస్థాన్ మహిళ, ఢిల్లీ యువకుడు సోనిపట్ రిసార్ట్లో మృతి