ముంబై | 5.50 లక్షల విలువైన 22 గ్రాముల MDMA డ్రగ్స్ థానే జిల్లాకు చెందిన ఒక వ్యక్తి కలిగిఉన్నాడని సమాచారం అందుకున్న నవీ ముంబై పోలీసులు, అతడిని పట్టుకునేందుకు నిఘా ఉంచి అరెస్టు చేశారు.
MDMA drugs | నవీ ముంబై పోలీసుల యాంటీ నార్కోటిక్స్ సెల్ (ANC) బృందం నిందితుడి నుండి 5.50 లక్షల రూపాయల విలువ చేసే 22 గ్రాముల MDMA drugsను స్వాధీనం చేసుకుని ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు బుధవారం ఒక అధికారి తెలిపారు. సోమవారం సాయంత్రం మహారాష్ట్రలోని నవీ ముంబై టౌన్షిప్లోని కోపర్ఖైర్నే ప్రాంతంలోని హోటల్ గేట్ దగ్గర ANC అధికారులు పక్కా సమాచారంతో తనిఖీలు నిర్వహించారు. నిందితుడిని 23 ఏళ్ల థానే జిల్లా ముంబ్రా ప్రాంతంలోని కౌసా నివాసిగా గుర్తించారు. అతని నుండి MDMA (Ecstasy) డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారి తెలిపారు. నిందితుడిపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (NDPS) చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుడు ఆ డ్రగ్స్ని ఎవరికి డెలివరీ చేయాలని ప్రయత్నించాడు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.