మెదక్: మెదక్ జిల్లాలో సోమవారం వేర్వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య యత్నానికి (suicide) పాల్పడ్డారు. మొదటి ఘటనలో మనోహరాబాద్ మండలం పొలాట గ్రామం వద్ద ఓ యువకుడు వేగంగా వెళ్తున్న రైలు చక్రాల కింద పడ్డాడు. అతను రామాయంపల్లి సర్పంచ్ పార్వతి కుమారుడు రావెల్లి భాస్కర్ (24). అతను ఆదివారం అర్థరాత్రి 10.30 గంటలకు తన ఇంటి నుండి బయలుదేరినట్లు సమాచారం. సోమవారం ఉదయం రైల్వే ట్రాక్పై భాస్కర్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.
మరో ఘటనలో చేగుంట మండలం రెడ్డిపల్లి చెరువులో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. బాధితుడు ఉప్పల శరత్ (31) శనివారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. సోమవారం తెల్లవారుజామున నీళ్లలో తేలుతూ మృతదేహం కనిపించింది. అతను తన జీవితాన్ని ముగించాలని నిర్ణయించుకోవడం వెనుక గల కారణాలు ఇంకా తెలియలేదు.