Home   »  జాతీయం   »   రేపు దోహాలో పర్యటించనున్న ప్రధాని మోదీ..!

రేపు దోహాలో పర్యటించనున్న ప్రధాని మోదీ..!

schedule mahesh

Prime Minister Modi | భారత ప్రధాని నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో (UAE) తన రెండు రోజుల పర్యటన ముగించుకుని బుధవారం ఖతార్ రాజధాని దోహాకు వెళ్లనున్నారు.

prime-minister-modi-will-visit-doha-tomorrow

Prime Minister Modi | భారత ప్రధాని నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో తన రెండు రోజుల పర్యటన ముగించుకుని బుధవారం ఖతార్ రాజధాని దోహాకు వెళ్లనున్నారు. ఖతార్ జైలులో ఉన్న 8మంది మాజీ భారత నేవీ సిబ్బందిని విడుదల చేసిన కొన్ని గంటల తర్వాత ఈ ప్రకటన వెలువడింది.

వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం మరియు డిజిటల్ డొమైన్‌తో సహా అనేక రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలను విస్తరించే లక్ష్యంతో మోడీ సోమవారం రెండు రోజుల UAE పర్యటనను ప్రారంభించారు. నేడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) పర్యటనను ముగించుకొని ఫిబ్రవరి 14 బుధవారం రోజున ప్రధాని మోదీ ఖతార్‌లోని దోహాకు వెళ్లనున్నారని భారత విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా మీడియా సమావేశంలో వెల్లడించారు.

ఖతార్ ఉన్నతాధికారులతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్న మోదీ

ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ, ఇతర ఉన్నతాధికారులతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారని క్వాత్రా వెల్లడించారు. భారతదేశం, ఖతార్ మధ్య వాణిజ్య, ఇంధన సంబంధాలు పురోగమిస్తున్నాయి. భారతదేశానికి సహజ వాయువు (LNG) యొక్క అతిపెద్ద సరఫరాదారు ఖతార్, భారతదేశం యొక్క గ్లోబల్ LNG దిగుమతులలో 48 శాతానికి పైగా వాటా కలిగి ఉందని విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా తెలిపారు.

Also Read | బీహార్ స్పీకర్‌ పదవి కోల్పోయిన అవధ్‌ బిహారీ..!